
విక్టరీ వెంకటేష్ ఇటీవల విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో తన కెరీర్లో అరుదైన ఘనత సాధించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని నమోదు చేసి, వెంకటేష్ను 300 కోట్ల క్లబ్లోకి చేర్చింది. ఇది ఆయన కెరీర్లో తొలి 300 కోట్ల గ్రాస్ వసూలు చేసిన చిత్రం. సాధారణంగా వెంకటేష్ సినిమాలు వచ్చి, ప్రేక్షకులను మెప్పించాయి కానీ, వాటిపై ఈ స్థాయిలో చర్చ జరగడం ఇదే మొదటిసారి. సినిమా అనౌన్స్మెంట్ దగ్గర నుంచి విడుదల వరకూ ఈ స్థాయిలో హైప్ ఉండటం వెంకటేష్కు చాలా అరుదు.
ఈ ఘన విజయం ఆయన మార్కెట్ను అమాంతం పెంచేసింది. ఇప్పటివరకు వెంకటేష్ను ఓ ఫ్యామిలీ హీరోగా చూడటం మామూలే. అయితే ఈ సినిమాతో ఆయన మార్కెట్ స్థాయిని మరింత పెంచుకొని, పెద్ద హీరోల సరసన నిలిచారు. ఇక ఆయన తదుపరి సినిమా గురించి సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు వెంకటేష్ సినిమాల గురించి ‘ఏ దర్శకుడితో చేస్తున్నాడు?’ అనే చర్చ పెద్దగా జరిగేది కాదు. అయితే 300 కోట్ల వసూళ్లను సాధించిన ఈ సినిమా తర్వాత ఆయన తదుపరి ప్రాజెక్ట్పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
సీనియర్ హీరోల్లో ప్రస్తుతం వెంకటేష్ ముందంజలో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి చివరగా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో 250 కోట్ల గ్రాస్ను మాత్రమే సాధించారు. ఆ తర్వాత వచ్చిన చిత్రాలన్నీ 200 కోట్ల లోపే వసూలు చేశాయి. ఇక బాలకృష్ణ, నాగార్జునల విషయానికొస్తే, వారంతా 100-150 కోట్ల మధ్య వసూళ్లను మాత్రమే అందుకున్నారు. ఈ నేపథ్యంలో వెంకటేష్ మాత్రం 300 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టడం విశేషంగా మారింది. దీంతో ఇకపై ఆయన చేసే ప్రతి సినిమాకు పెద్ద బిజినెస్ జరుగుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇంతటి విజయాన్ని చూసిన తర్వాత ఆయన తదుపరి సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఆయన ఏ సినిమాకు కమిట్ కాలేదు. దీంతో ఆయన తదుపరి ప్రాజెక్ట్ ఏ దర్శకుడితో ఉంటుందో అన్నది చర్చనీయాంశమైంది. ఇప్పుడు వెంకటేష్ ఎవరితో సినిమా చేసినా, 300 కోట్ల మార్కును దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కేవలం తెలుగు మార్కెట్కే పరిమితమై 300 కోట్లు వసూలు చేయడం విశేషం. ఇది ఆయనకు పాన్ ఇండియా మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం కూడా ఇచ్చేలా ఉంది. ఆయన కొత్త సినిమా కూడా అదే స్థాయిలో ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.
వెంకటేష్ ఇప్పటివరకు ఫ్యామిలీ సినిమాలతో ఎక్కువగా విజయాలు సాధించినా, ఈ సినిమా ద్వారా మాస్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు. దీంతో ఇకపై ఆయన చేయబోయే చిత్రాలు మరింతగా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేలా ఉండాల్సి ఉంటుంది. వెంకటేష్ కొత్త సినిమా ఎప్పుడు అనౌన్స్ అవుతుందనే దానిపై సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2025లో వెంకటేష్ ఏ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తారో చూడాలి.