
నాగచైతన్య తాజా సినిమా ‘తండేల్’ ఘన విజయం సాధించడంతో ఆయన కెరీర్లో మరో మంచి హిట్ చేరింది. ఈ విజయాన్ని అక్కినేని యంగ్ హీరో ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ సంతోష సమయంలోనే కొంత బాధకరమైన వార్తలు కూడా చైతన్యను చేరుకున్నాయి. ప్రత్యేకంగా తన భార్య శోభితా ధూళిపాళ్ గురించి కొన్ని తప్పుడు వార్తలు ప్రచారంలోకి రావడం ఆయనను కలతకు గురి చేసింది.
ఈ నేపథ్యంలో నాగచైతన్య స్వయంగా స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. శోభితాను టార్గెట్ చేస్తూ వస్తున్న నెగటివ్ ప్రచారంపై బాధ కలుగుతోందని, ఆమె ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. తన మాజీ భార్య సమంతా రూత్ ప్రభుతో విడాకులు తీసుకోవడంలో శోభితకు ఏమాత్రం సంబంధం లేదని చెబుతూ, సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు. అనవసరంగా ఆమెను ట్రోల్ చేయడం న్యాయం కాదని, ఆమె కూడా ఇలాంటి ఫేక్ న్యూస్ వల్ల బాధపడుతోందని పేర్కొన్నారు.
ఇంతకుముందు ‘రాటాక్స్ విత్ వీకే’ పాడ్కాస్ట్లో పాల్గొన్న నాగచైతన్య, రిలేషన్షిప్ బ్రేకప్ గురించి మాట్లాడుతూ ఒక వ్యక్తి నుంచి విడిపోవాలంటే వెయ్యిసార్లు ఆలోచిస్తానని తెలిపారు. ఆ మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకొని, సమంత-చైతన్య విడిపోవడానికి శోభిత కారణమనే రూమర్లు సృష్టించారు. కానీ ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, తనకు శోభితతో ఆ తర్వాత పరిచయం ఏర్పడింది అని స్పష్టంగా చెప్పారు.
తన జీవితంలో శోభిత ఒక అందమైన క్షణంగా వచ్చినారని, వాళ్ల స్నేహం సోషల్ మీడియా ద్వారా ప్రారంభమై క్రమంగా బలమైన సంబంధంగా మారిందని తెలిపారు. తమ బంధం సహజంగా, ఆర్గానిక్గా ఏర్పడిందని చెప్పుకొచ్చారు. ఒకరి జీవితంలోకి మరొకరు అంత సులభంగా రావడం సాధారణ విషయం కాదని, కానీ వారిద్దరి మధ్య అర్థవంతమైన అనుబంధం ఏర్పడిందని వివరించారు.
2024 ఆగస్టులో నాగచైతన్య, శోభితా వివాహం చేసుకుని కొత్త జీవితం ప్రారంభించుకున్నారు. ఈ కొత్త జీవితం అందరివరకు సంతోషకరమైనదే అయినప్పటికీ, ఆమెను టార్గెట్ చేస్తూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని చూస్తే బాధ కలుగుతోందని చైతన్య చెప్పారు. శోభిత ఈ పరిస్థితులను సమర్థంగా అర్థం చేసుకొని, చాలా ఒపిగ్గా, మెచ్యూర్డ్గా ఎదుర్కొంటున్నారని తెలిపారు. అలాంటి భార్య దొరకడం తనకు అదృష్టమని వెల్లడించారు.
ఇక నాగచైతన్య కెరీర్ పరంగా ‘తండేల్’ పెద్ద హిట్గా నిలిచింది. శ్రీకాకుళం ఫిషర్మెన్ పాత్రలో ఆయన కెరీర్లోనే బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారని సినీ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. సాయిపల్లవి కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్పై బన్నీ వాసు నిర్మించగా, అల్లు అరవింద్ సమర్పించారు. దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
ఈ విజయం నాగచైతన్య కెరీర్కు బలమైన మలుపు తిప్పింది. మరోవైపు వ్యక్తిగత జీవితంలోనూ శోభితతో కలిసి కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన, తన భార్యపై వస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండిస్తూ, ఆమెను గౌరవించాలని కోరారు.