2025 లో ఫ్యాన్స్ కు మాంచి ట్రీట్ అందిస్తున్న ప్రభాస్

0

ప్రభాస్ ప్రస్తుతం ఇండియన్ సినిమా మార్కెట్‌లో అత్యంత డిమాండ్ ఉన్న హీరోగా కొనసాగుతున్నారు. ఏ సినిమా ఒప్పుకున్నా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించబడుతోంది. కంటెంట్ పరంగా వేరియేషన్ చూపిస్తూ, ప్రతి సినిమాతో తన కెరీర్‌ను మరింత బలోపేతం చేసుకుంటున్నారు. ఇండస్ట్రీలో మిగిలిన స్టార్స్ అందరికంటే ప్రభాస్ ఇమేజ్ ఎక్కడో ముందుందని సినీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది రాజాసాబ్’ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాను జూన్ లేదా జూలైలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

మరోవైపు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ఏప్రిల్ 25న విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో ప్రభాస్ రుద్రుడి పాత్రలో కనిపించనున్నారు. ఇటీవలే విడుదలైన అతని ఫస్ట్ లుక్‌కు అద్భుతమైన స్పందన లభించింది. అంటే ప్రభాస్ నటించిన రెండు సినిమాలు చాలా తక్కువ గ్యాప్‌లో థియేటర్లలో విడుదల కానున్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ షూటింగ్ దశలో ఉంది. త్వరలో ప్రభాస్ ఈ ప్రాజెక్ట్‌లో పాల్గొననున్నారని సమాచారం. అలాగే సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో రూపొందనున్న ‘స్పిరిట్’ ఈ ఏడాది చివర్లో పట్టాలెక్కనుంది.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందనున్న ‘కల్కి 2898ఏడీ’ సెకెండ్ పార్టీ ఈ ఏడాది చివరిలో లేక 2025 ప్రారంభంలో మొదలయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ ప్రాజెక్టులన్నింటిలో ‘ఫౌజీ’ 2025లో విడుదలయ్యే అవకాశం ఉంది. అలాగే ‘స్పిరిట్’ 2027లో, ‘కల్కి 2898ఏడీ’ 2027 చివరలో లేదా 2028 ప్రారంభంలో విడుదల కావొచ్చు. కానీ ఈ ఏడాదిలోనే ప్రభాస్ అభిమానులకు రెండు భారీ సినిమాలతో పండగగా మారే అవకాశం ఉంది.

‘ది రాజాసాబ్’ హర్రర్ కామెడీ జోనర్‌లో రూపొందుతోంది. చాలా రోజుల తర్వాత ప్రభాస్ కామెడీ టైమింగ్‌ని అభిమానులు ఆస్వాదించనున్నారు. మరోవైపు ‘కన్నప్ప’లో అతని గెస్ట్ రోల్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని భావిస్తున్నారు. ఇందాకి చెప్పుకున్నట్లు, ప్రభాస్ కెరీర్ ప్రస్తుతం అత్యున్నత స్థాయిలో కొనసాగుతోంది. కేవలం అతని మార్కెట్ పరంగా మాత్రమే కాకుండా, తన పాత్రలను విభిన్నంగా ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకుల అంచనాలను పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇలా వరుస ప్రాజెక్టులతో డార్లింగ్ ప్రభాస్ మరో మైలు రాయిని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు.