
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి అందరికీ తెలిసిందే. ఆయన తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, తన ప్రతిభతో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. నటనతోనే కాకుండా, తన డెసెంట్ పర్సనాలిటీతో కూడా అభిమానులను ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు. మహేష్ జీవితంలో, సినీ కెరీర్లో ఎంతో మద్దతుగా నిలిచింది ఆయన భార్య నమ్రత శిరోద్కర్. ఓప్పొయింట్ గా చూసుకుంటే, మహేష్ విజయాల వెనుక ఆమె శ్రమ కూడా ఎంతో ఉంది. కానీ ఇటీవల ఆమె ఒంటరిగా కనిపించటం, ఈవెంట్స్ కు మహేష్ లేకుండా హాజరుకావటం నెటిజన్లలో ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తోంది. వీరిద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
నమ్రత శిరోద్కర్ ఒకప్పుడు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. అక్కడ వరుస సినిమాలు చేస్తూ, మంచి కెరీర్ని కొనసాగించింది. అయితే తెలుగులో మాత్రం చాలా తక్కువ సినిమాలు చేసింది. వాటిలో ‘వంశీ’ అనే సినిమా కీలకంగా మారింది. ఎందుకంటే, అదే సినిమా సమయంలో మహేష్ బాబుతో ఆమె ప్రేమలో పడింది. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకుని, నమ్రత పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పి కుటుంబానికి అంకితమైంది. పెళ్లయిన తర్వాత మహేష్ బాబుతో కలిసి ఆమె టాలీవుడ్ లో మంచి సంబంధాలను కొనసాగిస్తూ, కుటుంబ బాధ్యతలతో పాటు ఆయన కెరీర్కు కూడా వెన్నుగా నిలిచింది. ఏ కార్యక్రమమైనా, ఫంక్షన్ అయినా మహేష్ తో కలిసి నమ్రత హాజరవడం సహజం. కానీ ఇప్పుడు ఆమె ఎక్కువగా ఒంటరిగా కనిపిస్తోంది.
ఇటీవల ఈ ఇద్దరి విషయంలో ఓ దర్శకుడి పేరు తెరపైకి రావడంతో, వీరిద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహేష్ భార్య ఇలా ఒక్కరిగా కనిపించడంపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. అయితే, దీనికి అసలు కారణం డైరెక్టర్ రాజమౌళి అని టాక్ గట్టిగా వినిపిస్తోంది. మహేష్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్పై అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. రాజమౌళి సినిమా అంటే ఎంత సమయం పడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో కూడా ఆయన దర్శకత్వంలో సినిమాలు చేసిన హీరోలు, తాము చాలా కాలం లాక్ అయినట్లు ఫన్నీగా వ్యాఖ్యానించారు. మహేష్ కూడా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో పూర్తిగా బిజీగా ఉన్నాడు. హైదరాబాదులో ప్రత్యేకంగా వేసిన సెట్లో మొదటి షెడ్యూల్ జరుగుతోంది.
ఈ షెడ్యూల్లో మహేష్ పూర్తిగా మునిగిపోయిన నేపథ్యంలో, బయట కార్యక్రమాలకు హాజరయ్యే బాధ్యతను నమ్రత తీసుకుంది. గతంలో మహేష్ ఉన్నప్పుడూ ఆమె ఫంక్షన్లలో కనిపించేది, కానీ ఇప్పుడు మహేష్ సినిమా పనుల్లో నిమగ్నమైనందున ఆమె ఒక్కరే ఎక్కువగా కనిపిస్తోంది. అయితే, వీరిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ఇది పూర్తిగా ప్రొఫెషనల్ కారణమేనని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
మహేష్ బాబు సినిమా పనులు పూర్తి చేసుకున్న తర్వాత మళ్లీ నమ్రతతో కలిసి అన్ని కార్యక్రమాలకు హాజరవుతారని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాదిలో విడుదలవుతుందని అనుకున్నప్పటికీ, కొంత ఆలస్యం అవుతుందనే టాక్ వినిపిస్తోంది. మహేష్ అభిమానులు ఈ సినిమాపై ఎంతో అంచనాలు పెట్టుకున్నారని, ఇది ఆయన కెరీర్లో అత్యంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు.