Political

భోగి మంటలతో చంద్రబాబు`పవన్‌ల సంయుక్త పోరు షురూ…

ఈ సంవత్సరం భోగి మంటలకు రాజకీయంగా ప్రత్యేకత తీసుకురానున్నారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరియు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌లు. రాబోయే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసింది. ఇప్పటి వరకూ ఇరుపక్షాలూ విడివిడిగా వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యకలాపాలపై పోరాటం చేస్తుండగా,...

మంగళవారం ఏపీ రాజకీయాల్లో మరో పెను సంచలనం…

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. గంటకో బ్రేకింగ్‌ న్యూస్‌ తెరపైకి వస్తోంది. ఎప్పుడు ఏ సంచలన వార్తను ప్రసారం చేయాలా అని అటు మీడియా... ఎప్పుడు ఏ సంచలన వార్త చూడాలా అని ఇటు ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ ఉత్కంఠ సిరీస్‌లో భాగంగా ఇప్పుడు మరో సంచలన...

చంద్రబాబు ఫొటోను నేలకేసి కొట్టిన టీడీపీ రాష్ట్ర నేత…

రాజకీయాలంటేనే అంత... అవసరం తీరాక అల్లుడు ఏదో అయ్యాడట అలా ఉంటది యవ్వారం. నిన్నటి వరకూ నీవే దిక్కని, నీవే నాకు దేవుడివని, నీ జీవితం నీవు పెట్టిన భిక్షే అని భజనలకే వణుకు పుట్టేలా భజనలు చేసిన నాయకులు రాత్రికి రాత్రే ప్లేటు ఫిరాయించి, బండ బూతులు తిట్టడం ఇక్కడ మాత్రమే సాధ్యం. మళ్లీ అవసరం...

రఘురామ రాకతో భీమవరంలో టెన్షన్‌ మొదలు..

పశ్చిమగోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ తెచ్చిన సంతోషంతో పాటు, నర్సాపురం పార్లమెంట్‌ సభ్యులు కనుమూరు రఘురామకృష్ణంరాజు 4 సంవత్సరాల తర్వాత నియోజకవర్గంలోకి అడుగుపెట్టడంతో టెన్షన్‌ కూడా వచ్చింది. శనివారం ఉదయం ఆయన రాజమండ్రిలోని మధురపూడి విమానాశ్రయం నుంచి భారీ ఊరేగింపుతో భీమవరంలోని పెదమీరం ప్రాంతంలో గల తన ఇంటికి చేరుకున్నారు. రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటకు వచ్చిన...

11 మంది కిడ్నాప్‌ కేసులో వైసీపీ సీమ ఎమ్మెల్యే.. రంగంలోకి కలెక్టర్‌..

అధికారం చేతిలో ఉంటే ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటారు కొందరు నాయకులు. పైవారి అండదండలు పుష్కలంగా ఉన్నవారైతే మరీను ఎంతటి తీవ్ర నేరాలకు పాల్పడటానికైనా వెనకాడరు. దీనికి తోడు స్థానిక పోలీసుల అండదండలు ఉంటే ఇక చెప్పేదేముంది.. పైగా ఫ్యాక్షన్‌ కక్షలకు నెలవుగా మారిన ప్రాంతం అయితే ఇక చేయగలిగేదేది ఏముంది. ఈ కారణంగానే అనంతపురంజిల్లా రాప్తాడు...

కాక రేపుతున్న చంద్రబాబుతో షర్మిళ భేటీ…

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో శనివారం మరో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా కోరుతూ శుభలేఖ ఇవ్వటానికి కాంగ్రెస్‌ నాయకురాలు వై.యస్‌. షర్మిళరెడ్డి నారా చంద్రబాబు నివాసానికి విచ్చేశారు. దాదాపు అరగంటకు పైగా చంద్రబాబు నివాసంలో షర్మిళ ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి, చంద్రబాబుకు కలిపి...

ఇప్పుడు జనాల్లోకి ఎలా వెళ్లేదబ్బా… సీటు కోల్పోయిన నేతల అంతర్మథనం..

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. దశాబ్దాల నుంచి సాగుతున్న దారిని మార్చి కొత్త కొత్త రూట్‌లను నాయకులు ఎంచుకుంటున్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి 40కి పైగా ఎమ్మెల్యేలను, దాదాపు 10 ఎంపీలను వారి నియోజకవర్గాల మార్పు చేపట్టారు. ఇందులో కొందరికి స్థాన చలనం...

ఇది బాబుకు భారీ ఊరటే..

మొత్తానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏదైనా జరగాలని కోరుకుందో.. అది జరగలేదు. తెలుగుదేశం పార్టీ ఏదైతే జరగాలని కోరుకుందో అదే జరిగింది. అదే చంద్రబాబుకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడం. ఒకటి, రెండు కాదు.. ఏకంగా మూడు కేసుల్లో హైకోర్టు బుధవారం చంద్రబాబు నాయుడుకు బెయిల్‌ను మంజూరు చేసింది. వీటిలో ఒకటి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసు,...

వైసీపీలోకి ఒక ఎంపీ ఇన్‌.. వైసీపీ నుంచి ఒక ఎంపీ అవుట్‌…

చిరంజీవి హీరోగా నటించిన ‘ముఠామేస్త్రి’ చిత్రంలో విలన్‌ శరత్‌ సక్సేనా ఒక హత్య చేస్తాడు. ఆ తర్వాత ఒక చీమ చావుబతుకుల్లో పడితే.. దాన్ని జాగ్రత్తగా తీసి పక్కన పెడతాడు. అది కాస్తా ఊపిరి పీల్చుకుని వెళ్లిపోతుంది. దీనిపై శరత్‌ సక్సేనా స్పందింస్తూ ‘‘ఒక జీవి ప్రాణం తీశాను.. ఒక జీవికి ప్రాణం పోశాను లెవిలైపోయింది’’...

కేశినేనికి షాక్‌లు మొదలయ్యాయి…

పదవి అనే బెల్లం మన చేతుల్లో ఉన్నంత సేపూ కార్యకర్తలు, అభిమానులు మనచుట్టూనే ఉంటారు. ఒకవేళ అది కరిగిపోతోందని తెలిసిందో.. ఇక ‘‘ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక’’ అని పాడుకోవాల్సిందే. ప్రస్తుతం విజయవాడ ఎంపీ కేశినేని నాని పరిస్థితి అలాగే ఉంది. గత కొంత కాలంగా తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ అధిస్టానానికి కొరకరాని కొయ్యగా మారారు...

Latest News

“మీసాల పిల్ల” పీకింది

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...